గుంటూరు: కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటు చేసుకుంది. అమరావతి మండలం గిడుగు వద్ద స్నానం చేసేందుకు నదిలో దిగిన ఐగుదురు విద్యార్ధులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో గోపిరెడ్డి, లోకేష్ మృత దేహాలు లభ్యం కాగా మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన విద్యార్ధులు నందిగామ చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న నగేష్ , హరీష్, హరిగోపీలుగా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం కృష్ణా పుష్కరాల సందర్భంగా మంగళవారం ఉదయం 11 మంది విద్యార్ధులు గిడుగు పుష్కర ఘాట్ వద్ద నదిలో స్నానం చేసేందుకు దిగారు. నదీ ప్రాంతం లోతుగా ఉన్న విషయాన్ని వారు గుర్తించలేదు. ఒక్కసారిగా వచ్చిన నదీ ప్రవాహంలో ఐదుగురు విద్యార్ధులు కొట్టుకుపోయారు. కాగా పుష్కర ఏర్పాట్లు నిర్వహిస్తున్న అధికారుల వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment