వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు, బీపీ కూడా అదుపులో ఉంటుంది. గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుందట. ఎడారి దేశాల్లో విరివిగా లభించే ఖర్జూర పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వీటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. 100 గ్రాముల ఖర్జూరలో 0.90 ఎంజీ ఐరన్ లభిస్తుంది. రోజులో మనకు అవసరమయ్యే ఐరన్‌లో ఇది 11 శాతానికి సమానం.
ఖర్జూర పండ్లలో పొటాషియం కూడా అధిక మోతాదులో లభిస్తుంది. ఇది డయేరియా రాకుండా చూడటంలో తోడ్పడుతుంది. మలబద్ధకం నివారించడంలోనూ వీటిది ముఖ్యపాత్రే. రాత్రి పూట కొన్ని ఖర్జూరాలను నీటిలో వేసి తెల్లవారాక ఆ నీటిని తాగితే విరేచనం సాఫీగా అవుతుంది. వీటిలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి బరువు తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. అయితే వీటిలో చక్కెరలు ఉంటాయి కాబట్టి పరిమితంగానే తీసుకోవడం మంచిది.రక్తనాళాల్లోపేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో ఇవి ఇతోధికంగా తోడ్పడతాయి. ఖర్జూరాలను నానబెట్టిన మిశ్రమాన్ని తాగడం వల్ల గుండెకు కూడా మేలు కలుగుతుంది. రోజూ 5-6 ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా మెగ్నీషియం లభిస్తుంది. ఇది రక్త నాళాలను వెడల్పు చూసి రక్త సరఫరా సరిగా జరిగేలా చేస్తుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. 370 ఎంజీల మెగ్నీషియం తీసుకోవడం వల్ల రక్తపోటు వెంటనే అదుపులోకి వస్తుందని పరిశోధనల్లో తేలింది. డేట్స్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. రోజులో 400 ఎంజీల పొటాషియం తీసుకోవడం వల్ల గుండె పోటు ముప్పు 40 శాతం తగ్గుతుందట. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఖర్జూరాలను మీ ఆహారంలో తప్పకుండా భాగం చేసుకుంటారు కదూ!

No comments:

Post a Comment