నందమూరి బాలకృష్ణ కాల్పుల ఘటనలో లక్ష్మీ పార్వతి సంచలన విషయం బయటపెట్టారు. బాలయ్య ఇంట్లో జరిగిన కాల్పులు, ఆ తర్వాత వాచ్ మన్ హత్య కేసులో బాలయ్య ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లలేదు. ఆయన అనారోగ్యం పేరుతో కేర్ లో జాయిన్ అయ్యాడు. కానీ ఆకేసుల మాఫీ వెనుక నేనున్నానని లక్ష్మీ పార్వతి చెప్పారు. విజయవాడలో వైసీపీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన ఆమె…నాకు ఆ ఇంట్లో ఎన్టీఆర్ తర్వాత ఇష్టమైన వ్యక్తి….బాలకృష్ణ.

ఆయన కాల్పుల కేసులో ఇరుక్కున్నప్పుడు ఎలాగైనా సాయం చేయాలనుకున్నాను. ఆయన్ను బయట పడేయాలని తానే సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిని బతిమిలాడానని చెప్పారామె. తన మీద ఉన్న గౌరవంతో వైఎస్ ఎంతో సాయం చేశారు. ఆయనే లేకుంటే బాలయ్య జైలుకు వెళ్లేవాడని పరోక్షంగా చెప్పుకొచ్చారామె.కానీ ఆ నేత బిడ్డనే ఇప్పుడు అనరాని మాటలంటున్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఆమె ఎంత వరకు సాయం చేసిందో కానీ, వైఎస్ సాయం చేయడం వల్లే బాలయ్య బతికి బయటపడ్డాడని ఇప్పటికీ టీడీపీ నేతలు కూడా చెబుతుంటారని చాలా మంది అంటారు.

No comments:

Post a Comment