ప్రస్తుతం టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ ఈనెల 24 రిలీజ్ కానున్న ఒక మనసు సినిమా. ఈ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమా అను నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మెగా బ్రదర్ నాగబాబు తనయ నీహారిక ఈ సినిమాతో వెండి తెరపై ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై క్రేజ్ ఏర్పడింది. కాగా ఈ సినిమాకు హీరోయిన్ గా దర్శకుడి ఫస్ట్ ఛాయిస్ నీహారిక కాదట.. రామరాజు మొదట సమంతను సంప్రదించి కథను వినిపించరాట.. కథ నచ్చింది. కానీ 2016 జూన్ వరకూ డైరీ ఫుల్.. జూన్ తర్వాత ఐతే సినిమాకి డేట్స్ ఇస్తాను అని సమంత చెప్పిందట. నెక్స్ట్ రెజీనాను సంప్రదించారట... స్క్రిప్ట్ తనకు కూడా నచ్చిందని.. కానీ నెలకు ఐదు రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వగలను అని రెజీనా చెప్పిందట.. దీంతో మళ్ళీ హీరోయిన్ వేటలో దర్శకుడు ఉండగా.. నిర్మాత మధుర శ్రీధర్ సలహామీద నీహారిక ఫోటోలను చూశారట. అప్పుడు ఒక మనసు సంధ్య పాత్రకు నీహారిక కరెక్ట్ గా సెట్ అవుతుందని భావించి నాగబాబుని, నీహారికని అప్పుడు సంప్రదించారట. నీహారికకు కథ నచ్చడం వెంటనే ఒకే చెప్పడం జరిగిందని దర్శకుడు రామ రాజు చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ ఓ ట్రెండ్ నడుస్తోంది.. ఒకరు వదిలేసిన సినిమాలు వేరొకరికి సూపర్ హిట్ ఇచ్చి మంచి పేరు తెస్తున్నాయి.. ఇప్పుడు ఒక మనసు కూడా అంతే రిజల్ట్ ఇస్తుందా చూడాలి మరి..

No comments:

Post a Comment