దేవుడా..!!! ఇదినీకు న్యాయమేనా.??
ఆకలి కడుపులునింపే రైతన్నను ఆ మూగజీవాలను తీసుకుపోతావ ....??
ఆకలి కడుపుల మీదకొట్టే మృగాలను వదిలేసి.. 
పట్టెడు మెతుకులతో కడుపునింపుకొని పదిమంది పొట్టనింపే రైతన్నను ఎలా అయ్యా తీసుకుపోవాలనిపించిది..??

ఇది నీకు న్యాయమేనా..??
 
వాళ్ళబరువు మోసోది నువ్వుకాదుగా..??
నిన్నే నమ్ముకున్న ఆ కుటుంబానికి దిక్కెవరు..?
నిన్ను ఆరాధించడమే వాళ్ళ చేసిన పాపమా..?
అయ్యా మహనుబావ ఆ కుటుంబానికి ఏదోరూపంలో సాయపడు .....

కడప ( వైఎస్ఆర్ జిల్లా ) కమలాపురం శివారులో మల్లికార్జునరెడ్డి అనే రైతు... తన పొలంలో ఎద్దులతో పొలం దున్నుతున్నాడు. ఆ క్రమంలో పిడుగు రూపంలో మృత్యువు పడింది. దీంతో మల్లికార్జునరెడ్డి అక్కడికక్కడే మరణించాడు. రెండు ఎద్దులు కూడా మరణించాయి. మృతునికి భార్య, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.

No comments:

Post a Comment