నీట మునిగి జెన్కో ఏఈ దంపతుల మృతి
మన్ననూర్: ఫొటో సరదా దంపతుల ప్రాణాలు తీసింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ప్రమాదవశాత్తు నీటమునిగి జెన్కో ఏఈ దంపతులు మరణించారు. ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది. అమ్రాబాద్ ఎస్ఐ జాంగీర్యాదవ్ కథనం ప్రకారం..
హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన క్రాంతికుమార్ (33) కొంతకాలంగా జెన్కోలో ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భార్య సంయుక్త (28)తో కలసి బైక్పై శ్రీశైలం రిజర్వాయర్ ఇన్టెక్ టర్నల్ గేట్ సమీపంలోకి వెళ్లారు. సంయుక్త ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడింది. ఆమెను రక్షించే క్రమంలో క్రాంతి కుమార్ కూడా అందులో పడిపోయారు. దీంతో ఊపిరాడక ఇద్దరూ ప్రాణాలు వదిలారు.
No comments:
Post a Comment