యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా కాకినాడకు భార్య ప్రణతితో కలసి వెళ్ళాడు. తారక్ అన్నయ్య అయిన దివంగత జానకి రామ్ కుమారుల పంచె కట్టు ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే..వేళంగిలో ఉంటున్న జానకి రామ్ కుమారుల దగ్గరకి ఎన్టీఆర్ వెళ్ళగానే వాళ్ళిద్దరూ కూడా పరుగున వచ్చి బాబాయ్ ను గట్టిగా కౌగిలించుకున్నారు. దీంతో షడన్ గా అన్నయ్య జానకి రామ్ గుర్తుకువచ్చి కాస్త ఎమోషన్ అవ్వగా, ఈ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారంతా కన్నీరు పెట్టుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులంతా కలసి అట్టహాసంగా నిర్వహించిన ఈ దోవతి ఫంక్షన్ చాలా వరకు ఎమోషన్ గానే జరిగినట్టు తెలిసింది.

ఆద్యంతం జానకి రామ్ స్మరనలోనే జరిగిన ఈ కార్యక్రమంలో కుమారులిద్దరికీ కూడా పట్టు వస్త్రాలు ఇచ్చి ఎన్టీఆర్ దంపతులతో పాటు కళ్యాణ్ రామ్ జంట కూడా వారిని ఆశీర్వదించారు. ఇక తండ్రి లేని లోటును ఆ చిన్నారులకి ఎక్కడా తెలియకుండా జరిపినప్పటికీ, ఒకింత వెలితిగానే ముగిసిందట. బయట వారు కూడా ఒక్కసారిగా ఆ పిల్లల్ని చూసి, ఈ సమయంలో తండ్రి ఉంటే ఎంత సంతోషించేవాడో అని కన్నీరు పెట్టుకున్నట్టు సమాచారం.

No comments:

Post a Comment