హైదరాబాద్ కూకట్ పల్లి శుభోదయ కాలనీలోని ఓ ప్రైవేట్ కాన్సెప్ట్ స్కూల్ లో టెన్షన్ ఏర్పడింది. 8వ తరగతి చదువుతున్న మోనా అనే చిన్నారి.. పాఠశాల బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కింద పడింది. తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కల స్థానికులు.. పాపను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడిపోవటానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే అంటూ స్కూల్ పై దాడికి దిగారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ప్రిన్సిపాల్ తో గొడవకు దిగారు. క్లాస్ మధ్యలో బ్రేక్ ఇచ్చిన టైంలో.. చిన్నారి నైనా మూడో అంతస్తుకు వెళ్లినట్లు తెలిసింది. బిల్డింగ్ పైనుంచి కింద పడిన సమయంలో కాళ్లకు షూ లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థిని ప్రమాదవశాత్తు పడిందా.. లేక మరేదైనా కారణం ఉందా అనే విషయాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. చిన్నారి పేరంట్స్ జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు. స్థానికంగా వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

No comments:

Post a Comment