తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య ఆత్మహత్యల పర్వం ఎక్కవగా కొనసాగుతోంది. రకరకాల కారణాల వల్ల తీవ్ర మనోవేదనకు గురవుతున్న వాళ్లందరూ.. ఆత్మహత్యే శరణ్యమని బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ‘జబర్దస్త్’ షోలో కమెడియన్‌గా మంచి గుర్తింపు పొందిన పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఫ్యాన్‌కి ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. విశాఖపట్టణం, గాజువాకలోని శ్రీనగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘనట స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివాహం జరిగిన ఏడాదికే త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకోవడంతో.. ఎన్నో అనుమానాలు లేవనెత్తుతున్నాయి.

షూటింగ్ కోసం మూడు రోజుల క్రితమే పొట్టి రమేష్‌ హైదరాబాద్‌ వెళ్లగా.. ఈ సమయంలోనే త్రిపురాంబిక సూసైడ్ చేసుకుంది. తన భార్య చనిపోయిందన్న విషయం తెలిసిన వెంటనే పొట్టి రమేష్ విశాఖకి చేరుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారించగా.. పెళ్లి అయినప్పటి నుంచి తామిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లమని, తమ మధ్య ఎలాంటి మనస్పర్దలు లేవని పొట్టి రమేష్ తెలిపారు. తన భార్య సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలేంటో తమకూ తెలియదని అంటున్నారు. దీంతో.. ఈ పెళ్ళి ఇష్టం లేకపోవడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందా, లేదా అత్తమామల వేధింపులేమైనా కారణమా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు పొట్టి రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. తమ కుమార్తె మరణవార్త విని త్రిపురాంబిక పేరెంట్స్ విశాఖకు చేరుకున్నారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, పెళ్లైన మరుసటిరోజు నుంచే అత్త-ఆడపడుచు వేధించడం ప్రారంభించారని, తమ అమ్మాయిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వాళ్లు కుట్ర పన్నుతున్నారని త్రిపురాంబిక తల్లి ఆరోపించారు. ఇక ఈ ఘటనపై మహిళా సంఘం నేత ప్రభావతి మాట్లాడుతూ.. ఈ వ్యవహారంపై కేసులు పెట్టొద్దంటూ త్రిపురాంబిక కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు.

ఇలా పొట్టి రమేష్ ఫ్యామిలీపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. త్రిపురాంబిక సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా? ఒకవేళ రాసివుంటే అది ఎక్కడుందోనని వెతికే పనిలో బిజీ అయ్యారు. పొట్టిరమేష్ ఫ్యామిలీ మెంబర్స్ సూసైట్ నోట్ లేదని చెబుతున్నప్పటికీ.. వారిపై ఉన్న అనుమానంతో ఎక్కడైన ఉండవచ్చునని గాలిస్తున్నారు.

No comments:

Post a Comment