హైదరాబాద్: శంషాబాద్ మండలం కొత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు నటుడు భరత్ అంత్యక్రియలకు ఆయన సోదరుడు సినీ హీరో రవితేజ, కుటుంబ సభ్యులు హాజరుకాలేదు. చిధ్రమైన తమ్ముడు భౌతిక కాయాన్ని చివరి చూపు చూసి భరించలేనని ఆయన చెప్పారు. 30ఏళ్లుగా తమ్ముడు భరత్తో ఉన్న అనుబంధాన్ని రవితేజ గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ శోకసంద్రంలో ఉన్నారు.
దీంతో కుటుంబసభ్యులు ఎవరూ భరత్ అంత్యక్రియలకు హాజరుకాలేక పోయారు. అంత్యక్రియలకు ఎవరూ రాలేకపోవటాన్నిఅర్థం చేసుకోవాలంటూ రవితేజ మీడియాకు, మిత్రులకు కోరారు. అంతకు ముందు భరత్ భౌతిక కాయాన్ని ఉస్మానియా ఆస్పత్రి నుంచి నేరుగా మహాప్రస్థానానికి తరలించారు. రవితేజ మూడో సోదరుడు రఘు అంత్యక్రియలను పర్యవేక్షిస్తున్నారు. కొద్ది మంది మిత్రులు, పరిచయస్తులు మాత్రమే అంత్యక్రియలకు హాజరయ్యారు.
No comments:
Post a Comment