ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఏసుప్రభువు కొలువున్న అమెరికా దేశం మాత్రం ప్రవేశించ లేదని క్రైస్తవ మత పెద్ద  డేవిడ్ పాల్ గారు అభిప్రాయపడ్డారు. 


చైనాలో తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నా ఈ వైరస్ ప్రపంచమంతా చాపకింద నీరులాగా వ్యాపిస్తుందని పాపులను, దేవుని యందు విశ్వాసం లేనివారిని అంతమో దించడమే ఈ వైరస్ యొక్క లక్షణమని తేల్చి చెప్పారు. 

ఇప్పటికే తెలుగు రాష్ట్రమైన తెలంగాణకు చేరుకున్న కరోనా అతి త్వరలోనే ఆంధ్రరాష్ట్రం ప్రవేశిస్తుందని ముందస్తు జాగ్రత్తగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ ప్రేయర్ ఆయిల్ అందించాలని కోరారు . సాతాను శక్తి అయిన కరోనా కి విరుగుడు దేవుడి పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రేయర్ ఆయిల్ లో వారు కావలసిన మోతాదులో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానమని అందుకు రాష్ట్ర ప్రభుత్వం  వారితో ఒప్పందం కుదుర్చుకొని ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయాలని కోరారు.

ఇదిలా ఉండగా , దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ బాధితులు సంఖ్య పెరుగుతుంది . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవాలని , బయటకు వెళ్లే సమయంలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని అధికారులు సూచించారు. ప్రస్తుతానికి కరోనా వైరస్ గురించి భయాందోళనకు చెందాల్సిన అవసరం లేదని ప్రజలు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని వారు తెలియజేశారు.

No comments:

Post a Comment